Tirupati Greater Municipality: తిరుపతి ఇక గ్రేటర్ సిటీగా మారనుంది! 30 చ.కి.మీ నుంచి 284 చ.కి.మీకి విస్తరించనున్న నగరం, 4.5 లక్షల నుంచి 7.5 లక్షలకు పెరగనున్న జనాభా. గ్రామీణ, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని 63 గ్రామ పంచాయతీలు విలీనం కానున్నాయి. సీఎం ఆదేశాలతో ఈ ప్రతిపాదనలు ప్రభుత్వ ఆమోదం కోసం సిద్ధమయ్యాయి. తిరుపతి రూపురేఖలు మారనున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఆమోదం రాగానే తిరుపతి గ్రేటర్ సిటీగా మారనుంది.