తిరుపతిలో మత్తు ఇంజెక్షన్లు కలకలం రేపాయి. తిరుపతిలోని ఇందిరా ప్రియదర్శిని మార్కెట్లో కొంతమంది యువకులు మత్తు ఇంజెక్షన్లు తీసుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. మార్కెట్లో మత్తు ఇంజెక్షన్లు కనిపించడం కలవరం రేపుతోంది. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో మత్తు పదార్థాల వాడకం పెరుగుతోందని.. పోలీసులు, ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం.