తిరుపతి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు స్నేహితులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన తడ మండలం కొండూరు వద్ద చోటుచేసుకుంది. చనిపోయిన వారిలో కళ్యాణ్ అనే యువకుడికి నెలన్నర రోజుల కిందటే పెళ్లి జరిగింది. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.