తిరుపతి స్థానికులకు ముఖ్య గమనిక. స్థానికులకు శ్రీవారి దర్శనం కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. ఫిబ్రవరి 9వ తేదీన స్థానికులకు ఈ టోకెన్లు జారీ చేస్తారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలోని బాలాజీ కమ్యూనిటీ హాల్ వద్ద ఈ టోకెన్లు జారీ చేస్తారు. టోకెన్లు పొందిన భక్తులకు ఫిబ్రవరి 11న శ్రీవారి దర్శనం కల్పిస్తారు. వాస్తవానికి ఫిబ్రవరి నెలలో వచ్చిన మొదటి మంగళవారంలోనే స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాల్సి ఉంది. అయితే రథసప్తమి కారణంగా ఇది రెండో వారానికి వాయిదా పడింది.