అనంతపురం జిల్లా ప్రజలకు గమనిక! జూలై 11న కదిరిదేవరపల్లి-తిరుపతి రైలు రద్దు చేశారు. రాయదుర్గం-సోమలాపురం మధ్య ట్రాక్ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, జూలై 12 నుండి రైలు యథావిధిగా నడుస్తుందని అధికారులు తెలిపారు. తిరుపతి వెళ్లే ప్రయాణికులు ఈ మార్పును గమనించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.