తిరుపతి వెళ్లేవారికి శుభవార్త.. తిరుమలలో కొత్త సదుపాయం.. ఇక ఆ ఇబ్బందులు తప్పినట్టే

1 year ago 26
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు తీపికబురు. తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా తిరుమలలో వసతి గదులు దొరక్క ఇబ్బంది పడే భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ నూతన లాకర్ కౌంటర్ అందుబాటులోకి తెచ్చింది. యాత్రికుల వసతి సముదాయం -3లో సెంట్రల్ లాకర్ కౌంటర్ అందుబాటులోకి తెచ్చారు. తిరుమలలో గదులు దొరకని భక్తులు ఇబ్బంది పడొద్దని.. ఈ లాకర్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని టీటీడీ సూచించింది.
Read Entire Article