muni vahana seva: తిరుపతి జిల్లాలో సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా మునివాహన సేవ జరిగింది. ఛాయా మార్తాండ పీఠాధిపతి సుబ్రహ్మణ్య శాస్త్రి, దళిత పీఠాధిపతి మాతానందగిరి స్వామిని భుజాలపై మోసి ఆలయంలోకి తీసుకెళ్లారు. గతంలో చిలుకూరు బాలాజీ ఆలయంలోనూ ఇలాంటి సంఘటన జరిగింది. సనాతన ధర్మ రక్షణ కోసం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో శనివారం నాడు మునివాహన సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూడటానికి పెద్ద ఎత్తున జనాలు హజరయ్యారు. ఆ వివరాలు..