తిరుపతిలో అర్థరాత్రి ఘోర ప్రమాదం.. శ్రీవారి భక్తులకు తప్పిన ముప్పు..

10 months ago 40
తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం అగరాల హైవే రోడ్డుపై ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడులోని తిరువన్నమలై నుండి శ్రీవారి దర్శనానికి భక్తులతో వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు ఉండటం విషాదకరం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం తిరుపతి పరిసర ప్రాంతాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Read Entire Article