ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతులు, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా కీలక అడుగు పడింది. ప్రముఖ హైందవ ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో 600 ఎకరాల్లో వసుధైక కుటుంబం పేరిట ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక టౌన్షిప్ను నిర్మించేందుకు డెల్లా గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.3 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ టౌన్షిప్లో 5 వేల సంవత్సరాల హిందూ చరిత్రను ప్రపంచానికి తెలియజేసే ఎగ్జిబిషన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.