తిరుమలలో శ్రీవాణి దర్శన టికెట్లకు డిమాండ్ తగ్గిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తిరుమల తిరుపతి దేవస్థానం స్పందించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీవాణి దర్శనం టికెట్లపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అబద్ధమని టీటీడీ తెలిపింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని కోరింది. ఎప్పటిలాగే ఆఫ్లైన్, ఆన్లైన్లో శ్రీవాణి దర్శనం టికెట్లను భక్తులు బుక్ చేసుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో తెలిపింది.