తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో అందించే ఉచిత భోజనాన్ని ప్రశంసిస్తూ తాను చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. తిరుమల అన్న ప్రసాదం బాగుందంటూ అంబటి మాట్లాడిన వీడియో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద అంబటి రాంబాబు స్పందించారు. తిరుమలలో ఎన్నో ఏళ్ల నుంచి భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తున్నారని.. తన మాటలను కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలనుకోవటం శునకానందం అంటూ అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.