Tirumala Police Register Case Against Hyderabad Man: తిరుమల టీటీడీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన హైదరాబాద్కు చెందిన మహమ్మద్ రఫీపై కేసు నమోదైంది. అన్నప్రసాదంపై వక్రీకరించిన రీల్ను షేర్ చేసి, టీటీడీ యాజమాన్యాన్ని అపకీర్తి పాలు చేశారని ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీపావళి ఆస్థానం నేపథ్యంలో కొన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. 2026 క్యాలెండర్లు, డైరీల విక్రయం ప్రారంభమైంది.