తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ హెచ్చరిక జారీ చేసింది. నకిలీ వెబ్ సైట్లు ద్వారా టికెట్ల ఇస్తామని మోసం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు, తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. అన్నమయ్య భవన్ అతిథి గృహం సమీపంలో చిరుత కనిపించింది.