తిరుమలలో ట్రాఫిక్ పోలీసుల సమయస్ఫూర్తితో వ్యవహరించి ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కాపాడారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం బద్వేలుకు చెందిన ఓ కుటుంబం తిరుమలకు వచ్చింది. అయితే చిన్నారుల పెదనాన్న వారిని కారులో ఉంచి.. దర్శనం గురించి సమాచారం తెలుసుకునేందుకు బయటకు వెళ్లారు. అయితే డోర్లు లాక్ చేయటంతో ఊపిరాడక పిల్లలు ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే అక్కడే ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు విషయాన్ని ట్రాఫిక్ పోలీసులకు తెలియజేయగా.. వారు ఘటనాస్థలికి చేరుకుని పిల్లలను కాపాడారు.