తిరుమల కొండపై చైన్ స్నాచర్ హల్ చల్ చేశాడు. మాధవ నిలయం వద్ద సోమవారం ఈ ఘటన జరిగింది. ఓ భక్తురాలి మెడలో నుంచి బంగారు గొలుసు తెంచుకెళ్లే ప్రయత్నం చేయగా.. భక్తురాలి గట్టిగా కేకలు వేసింది. దీంతో స్థానికులు దొంగను పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి విజిలెన్స్ సిబ్బందికి అప్పగించారు. మరోవైపు తిరుమలలో ఫిబ్రవరి 26వ తేదీన క్షేత్రపాలకుడికి అభిషేకం నిర్వహించనున్నారు. మహా శివరాత్రి సందర్భంగా అభిషేకం చేయడం ఆనవాయితీ.