తిరుమల క్యూలైన్లో భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కృష్ణతేజ అతిథి గృహం సమీపంలోన క్యూలైన్లో భక్తుల మధ్య కొట్లాట జరిగింది. ఇద్దరు భక్తులు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనపై టీటీడీ స్పందించింది. భక్తులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది. ఇద్దరు భక్తులు ఘర్షణ పడ్డారని.. టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారని టీటీడీ పేర్కొంది. భక్తులు ఓపికతో వ్యవహరించి శ్రీవారిని దర్శించుకోవాలని సూచించింది.