రూ. 225 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్ను సమీక్షించారు. ఏప్రిల్ 6న పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా విశాలమైన రోడ్లు, పర్యావరణహిత రవాణా, కఠినమైన ఆధ్యాత్మిక నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాల పవిత్రతను కాపాడుతూ తిరుమల తరహాలో బాసరను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.