Tiruchanoor Sri Padmavathi Ammavari Temple Brahmotsavam: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఈవో జే శ్యామలరావు పరిశీలించారు. అక్కడ ఏర్పాట్లు, అన్న ప్రసాదాలను పరిశీలించారు. అలాగే నేటి నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల నడుమ పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు.