తిరుమల దర్శనానికి వచ్చి ఇదేం పని.. మద్యం తాగి, కర్ణాటక భక్తుడు ఏం చేశాడో తెలుసా?

11 months ago 25
తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని గురవరాజుపల్లిలో మంగళవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. శివ అనే వ్యక్తి 220 కేవీ హైటెన్షన్ విద్యుత్ టవర్‌ పైకి ఎక్కి కొన్ని గంటల పాటు అక్కడ తీవ్ర ఉద్రిక్తత సృష్టించాడు. అతని కోసం అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో.. వైర్లను పట్టుకుని స్టంట్లు చేశాడు. చివరికి ఆ టవర్‌పై నుంచి కిందకు దూకగా.. పోలీసులు ఏర్పాటు చేసిన వలలో పడ్డాడు. తలకు తీవ్ర గాయాలైన శివను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటకకు చెందిన శివ తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన రైలు మిస్ కావడంతో మద్యం సేవించి ఈ పని చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Entire Article