తిరుమల పరకామణి చోరీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదుతో పాటుగా చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు ఏపీ హైకోర్టు ఏసీబీ డీజీ, సీఐడీలకు అనుమతి ఇచ్చింది. అలాగే లోక్ అదాలత్లో రాజీ వ్యవహారం, నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు కొనసాగించాలని సీఐడీ, ఏసీబీ డీజీలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం కేసు విచారణను డిసెంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.