TTD On Tirumala Srivari Temple Parakamani Theft: తిరుమల శ్రీవారి పరకామణిలో గతేడాది జరిగిన చోరీ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. భారీగా బంగారం చోరీ జరిగిందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో టీటీడీ స్పందించింది.. ఈ అంశంపై క్లారిటీ ఇచ్చింది. గతేడాది పరకామణిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది పెంచలయ్య బంగారం చోరీ చేసేందుకు ప్రయత్నించారని.. టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ అతడ్ని పట్టుకుని కేసు నమోదు చేశారని.. కేసు కోర్టు పరిధిలో ఉందని టీటీడీ తెలిపింది.