శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. శ్రీవారి దర్శనం, వసతి పేరుతో ఇంటర్నెట్లో నకిలీ వెబ్సైట్లు ఉన్నాయని వాటితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సైట్లను తిరుమల పోలీసులు 30 వరకూ గుర్తించారు. తిరుమలలోని గెస్ట్ హౌస్ల పేరుతో నకిలీ వెబ్సైట్లు ఉన్నాయని వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులకు సూచించారు. ఏవైనా అనుమానాస్పద వెబ్సైట్లు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.