తిరుపతి లడ్డూ తయారీ సామర్థ్యం పెరగనుంది. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్ అందించిన విరాళాలతో తిరుమలలోని బూందీ పోటులో ఆధునిక పరికరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు సీఎస్కే సీఈఓ విశ్వనాథన్.. టీటీడీ అధికారులతో సమావేశమై బూందీ పోటులో పనులను పరిశీలించారు. భవిష్యత్తులోనూ మరింత సహకారం కొనసాగిస్తామని సీఎస్కే ప్రతినిధి వెల్లడించారు. అయితే గతంలోనూ బూందీ పోటు నిర్మాణానికి శ్రీనివాసన్ విరాళాలు అందించిన విషయం తెలిసిందే.