తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త. పెద్దపల్లి నుండి తిరుపతికి ప్రయాణం మరింత సులభం కానుంది. నాందేడ్ నుండి ధర్మవరం వరకు తిరుపతి మీదుగా కొత్త రైలును రైల్వే శాఖ ప్రారంభించనుంది. సెప్టెంబర్ 5 నుండి ఈ రైలు ప్రయోగాత్మకంగా నడుస్తుంది. ఇక నుంచి పెద్దపల్లి మీదుగా తిరుపతికి వారానికి ఆరు రైళ్లను అందుబాటులోకి రానున్నాయి.