Tirumala Sv Museum World Class Experience: తిరుమలలోని ఎస్వీ మ్యూజియం వరల్డ్ క్లాస్ లెవల్లో రూపుదిద్దుకుంటోంది. మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో నిర్వహించే బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.టీసీఎస్ సౌన్యంతో ఈ ఆధునీకరణ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుమలలో ఏర్పాట్లపై కీలక సమీక్ష చేశారు.