Tirumala Sri Venkateswara Museum Works: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులపై టీటీడీ దృష్టి సారించింది. ప్రపంచ స్థాయి వస్తు ప్రదర్శనశాలగా తీర్చిదిద్దాలని అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులకు సూచించారు. భద్రతా చర్యలు, ఆధునిక సాంకేతికతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరోవైపు, ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు పలువురు భక్తులు విరాళాలు అందించారు. జూలై 6 నుండి 9 వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు జరగనున్నాయి.