Banglore Devotee Donated Two Mobile Vans To TTD: తిరుమల శ్రీవారికి భక్తులు విరాళాలను సమర్పిస్తుంటారు. కొందరు భక్తులు బంగారం, వెండి, డబ్బుల రూపంలో విరాళాలు ఇస్తుంటారు. కొందరు మాత్రం వస్తువుల రూపంలో కూడా విరాళాలు అందజేస్తారు. తాజాగా బెంగళూరుకు చెందిన భక్తుడు తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీకి రెండు ఫాస్ట్ఫుడ్ వ్యాన్లను విరాళంగా అందజేశారు. ఈ వాహనాలను తిరుమల శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేయడం కోసం వినియోగించనున్నారు.