తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు చేసిందని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేసినట్లు వెల్లడించారు. 182 గంటల వైకుంఠ ద్వార దర్శన సమయంలో.. 164 గంటలకు పైగా సామాన్య భక్తులకే కేటాయించినట్లు చెప్పారు. ఈ మేరకు దర్శనాలు, టికెట్లకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడంతో పాటు.. శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.