వైకుంఠ ద్వార దర్శనాల కోసం తిరుమల శ్రీవారి ఆలయం సిద్ధం అవుతోంది. వచ్చే నెలాఖరున ప్రారంభం కానున్న వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ ఈసారి లక్కీ డిప్ పద్దతిలో టికెట్లు జారీ చేస్తోంది. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు వెళ్లాలి అనుకునే భక్తులు 3 రోజుల పాటు లక్కీ డిప్ విధానంలో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. అందులో ఎంపికైన వారికి టికెట్లు ఇవ్వనున్నారు. ఈ టికెట్లు ఉచితంగా ఇస్తున్నట్లు టీటీడీ తెలిపింది. యాప్, వెబ్సైట్తోపాటు వాట్సాప్లోనూ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది.