Tirumala Anna Prasadam Vegetable Donors Meeting: తిరుమల శ్రీవారికి అన్నప్రసాద సేవలో కూరగాయల దాతల సహకారం వెలకట్టలేనిదని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. రానున్న బ్రహ్మోత్సవాల దృష్ట్యా దాతల సహకారం కోరారు. గత నాలుగేళ్లలో కూరగాయల విరాళాలు పెరిగాయని, రోజుకు 25 రకాల కూరగాయలు విరాళంగా ఇస్తున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు, బదిలీపై వెళ్తున్న ఈవో శ్యామలరావుకు టీటీడీ ఘనంగా సన్మానం చేసింది. ఆయన తీసుకువచ్చిన సంస్కరణలను అధికారులు కొనియాడారు.