Ai Frc Cameras In Front Of Tirumala Srivari Temple: తిరుమలలో భద్రతను పటిష్టం చేసేందుకు టీటీడీ అత్యాధునిక ఏఐ ఆధారిత ఫేస్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయం దగ్గర ఈ కెమెరాలు భక్తుల రద్దీని అంచనా వేయడంతో పాటు, వాహన సేవల దర్శనాలపై ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తాయి. శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకలో వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థస్నానం చేశారు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు వైభవంగా జరిగాయి.