వేసవి రద్దీ, వీకెండ్ కావటంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో శ్రీవారి దర్శనానికి అధిక సమయం పడుతోంది. శనివారం రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీకి రూ.4.12 కోట్ల ఆదాయం వచ్చింది. భక్తుల సంఖ్య పెరగటంతో శ్రీవారి హుండీకి కానుకల ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరిగింది. అయితే శనివారం సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అనుకోని ఘటన జరిగింది. కొంతమంది భక్తులు గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకూ పరిస్థితి వెళ్లింది. దీంతో విజిలెన్స్ సిబ్బంది వారిని పక్కకు తీసుకెళ్లారు.