Tirumala Darshan TTD Technology: తిరుమల శ్రీవారి దర్శనం మరింత సులభతరం చేసేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. భక్తులకు కేటాయించిన సమయంలోనే దర్శనం కల్పించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. క్యూఆర్ కోడ్, ముఖ గుర్తింపు ద్వారా భక్తులను ధృవీకరించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ మేరకు టీటీడీ ఈవో కీలక సమీక్ష చేశారు. మరోవైపు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో కవచ సమర్పణతో జ్యేష్టాభిషేకం ఘనంగా ముగిసింది.