Tirumala Devotees Rush: తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వరుస సెలవుల కారణంగా గురువారం రాత్రి నుండి భక్తులు పోటెత్తారు. అలిపిరి సప్తగిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. మరోవైపు తిరుమలలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. లడ్డూ, అన్న ప్రసాదాల రుచిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. కళ్యాణకట్టలో పరిశుభ్రత పాటించాలని అధికారులకు సూచించారు.