Chandrababu In Tirumala Integrated Command Control Center: తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నిర్వహిస్తున్నఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం అధికారులతో చంద్రబాబు సమీక్ష చేశారు. తిరుమలలో సౌకర్యాలు, భక్తులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఏఐ సాయంతో శ్రీవారిని భక్తులు త్వరగా దర్శించుకునేలా టీటీడీ ప్లాన్ చేస్తోంది.. ఈ మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.