తిరుమల శ్రీవారి దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. రెండు రోజుల పర్యటన..

7 months ago 18
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. ఈ నెల 20న తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. మరుసటి రోజు (నవంబర్ 21న) తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాగా, రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో టీటీడీ అధికారులు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఏర్పాట్ల గురించి చర్చించారు. కాగా, ఇటీవల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తొలి రాష్ట్రపతిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
Read Entire Article