Tirumala Darshan Tokens Cheating: తిరుమల వచ్చే భక్తుల్ని టీటీడీ ఎన్నో సందర్భాల్లో హెచ్చరించింది. అయినా సరే కొందరు భక్తులు మాత్రం అమాయకంగా మోసపోతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన కరీంనగర్ భక్తుడు శ్రీనివాస్ను టికెట్ల పేరుతో మోసం చేశారు. దర్శనం టికెట్ల కోసం రూ.43 వేలు తీసుకుని మోసగించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మరోవైపు, తిరుమల ఘాట్రోడ్డులో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. జూలై నెలలో తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో జరగబోయే ఉత్సవాల వివరాలను టీటీడీ ప్రకటించింది.