Vr Technology In Tirumala Queue Lines: తిరుమల శ్రీవారి దర్శించుకునే భక్తుల కోసం టీటీడీ సరికొత్త ఆలోచన చేసింది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం వర్చువల్ రియాలిటీ విధానాన్ని తీసుకురానున్నారు. భక్తులకు తిరుమల శ్రీవారి వైభవం, క్షేత్ర విశేషాలు తెలియజేసే విధంగా టీటీడీ ప్లాన్ చేస్తోంది. ముందుకు కంపార్ట్మెంట్లలో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ వీఆర్ టెక్నాలజీ ఉపయోగంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.