Tirumala Devotees Donated TTD Rs 20 Lakhs : తిరుమల శ్రీవారికి భక్తులు భారీ విరాళాలు అందించారు. తిరుపతికి చెందిన ఎల్వీ లాజిస్టిక్స్ సంస్థ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు, బెంగుళూరుకు చెందిన భక్తుడు స్విమ్స్ పథకానికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చారు. జూలై 28న టీటీడీ పాఠశాలల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై సద్గమయ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆగస్టు నెలలో గోవిందరాజస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు జరుగుతాయని టీటీడీ తెలిపింది.