TIrumala TTD Reforms In Srivari Seva Voluntary System: తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు సేవ చేసే శ్రీవారి సేవకులకు మరింత శిక్షణ ఇవ్వాలని టీటీడీ ఈవో ఆదేశించారు. వైద్య, విద్య, ఇంజనీరింగ్ రంగాల నిపుణులను సేవలో భాగస్వామ్యం చేయనున్నారు. ప్రవాసాంధ్రులు సేవ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి కోదండరామస్వామివారి ఆలయంలో మే నెలలో ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. పుష్పయాగం, అష్టోత్తర శతకలశాభిషేకం, హనుమంత వాహన సేవ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.