TTD Srivari Seva: తిరుమల శ్రీవారి సేవకులు హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. సేవా సదన్ లో ట్రైన్ ద ట్రైనర్స్ కార్యక్రమానికి హాజరై, సేవకులతో మాట్లాడారు. 2000లో 200 మందితో మొదలైన శ్రీవారి సేవ ఇప్పుడు 17 లక్షల మందికి చేరడం గొప్ప విషయమన్నారు. స్థానికాలయాల్లోనూ శ్రీవారి సేవను విస్తరించనున్నట్లు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కార్తీక దీపోత్సవం నిర్వహించారు.