దిత్వా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల తిరుపతిలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. కొండపై వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచనలు జారీ చేశారు. ఘాట్ రోడ్లపై పొగమంచు, జారే స్వభావం కారణంగా డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా భక్తులు రెయిన్ కోట్లు, గొడుగులు, వెచ్చని దుస్తులు ధరించాలని సూచించారు.