తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. జులై నెలకు సంబంధించిన దర్శనం, గదుల టికెట్లను టీటీడీ రేపు విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల వంటి సేవల టికెట్ల కోసం రేపు ఆన్ లైన్ కోటా విడుదల చేయనున్నారు. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ టికెట్లను 22న విడుదల చేస్తారు. ప్రత్యేక దర్శనం, శ్రీవాణి టికెట్లు, వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్లను కూడా త్వరలో అందుబాటులో ఉంచనున్నారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏప్రిల్ 24న విడుదల చేస్తారు. గదుల కోటా కూడా అదే రోజు విడుదల కానుంది.