శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా టీటీడీ ఈవో శ్యామలరావు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే రద్దీ సమయంలో వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో భక్తులు ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేకుండా.. వేరొకచోట మరో అన్న ప్రసాద భవనం ఏర్పాటు చేసే ఆలోచన పరిశీలించాలని అధికారులకు సూచించారు.