తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్లను.. ఈ నెల 18న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇక కల్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఇతర ఆర్జిత సేవల టికెట్లు 21న విడుదలవుతాయని తెలిపింది. అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు 24న అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 25న విడుదల చేయనున్నట్లు తెలిపింది.