తిరుమలలో జనవరి 25న జరగనున్న రథసప్తమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. వేడుకల సందర్భంగా 14 రకాల వంటకాలతో భక్తులకు అన్నప్రసాదాలు అందించనున్నట్లు వెల్లడించారు. 2,400 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శ్రీవారి వాహనసేవల ముందు 56 కళా బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. కాగా, ఈ ఏడాది రథసప్తమి వేడుకలకు రెండున్నర లక్షల మంది భక్తులు వస్తారని అంచనా.