Tirumala Rs 300 Darshan Tickets And Accommodation: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మంచి అవకాశం కల్పించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, వసతి గదుల ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది. ఇవాళ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేస్తోంది.. అలాగే తిరుమల, తిరుపతిలో వసతి గదుల కోటాను కూడా విడుదల చేయనుంది. భక్తులు బుక్ చేసుకోవాలని సూచించింది టీటీడీ.