Tirumala TTD Cancelled Arjitha Sevas: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నాలుగు రోజుల పాటూ ఆర్జిత సేవల్ని టీటీడీ రద్దు చేసింది. ఈ నెల 5 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవల్ని రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. ప్రతి ఏడాది పవిత్రోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయంలో ఏడాది పొడవునా జరిగే దోషాల వల్ల పవిత్రతతకు ఇబ్బంది లేకుండా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.