తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. మే నెలకు సంబంధించిన తిరుమల దర్శనం, వసతి గదుల కోటా విడుదల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఫిబ్రవరి 18న ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది. రూ.300 ప్రత్యేక దర్శనం కోటాను ఫిబ్రవరి 24వ తేదీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. తమ అధికారిక వెబ్ సైట్ ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం, వసతి గదులను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేసింది.