TTD Annamayya Sankeerthanalu On Youtube: తిరుమల శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య సంకీర్తనలను యూట్యూబ్ ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు ఈవో జె. శ్యామలరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలో ఇంజినీరింగ్ పనులను సకాలంలో పూర్తి చేయాలని, వేసవిలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు టీటీడీ ఈవో. మే నెలలో శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలను కూడా తెలియజేశారు.